21 వ శతాబ్దములో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలకు ఆస్ట్రేలియాలోని సుందరనగమైన సిడ్నీ వేదికగా నిలిచింది. 2000 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన 27 వ ఒలింపిక్ క్రీడలలో 199 దేశాల నుంచి 10651 క్రీడాకారులు పాల్గొని తమ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. 298 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా 37 క్రీడాంశాలలో నెగ్గి అత్యధిక స్వర్ణ పతకాలతో ప్రథమస్థానంలో నిలిచింది.భారత్కు చెందిన కరణం మల్లేశ్వరి మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిప్టింగ్లో కాంస్యం సాధించి భారత్కు ఏకైక పతకం సంపాదించిపెట్టింది.
2000 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు 300 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 37 స్వర్ణ పతకాలను సాధించి అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు రష్యా, చైనాలు పొందినాయి.
స్థానం | దేశం | స్వర్ణ పతకాలు | రజత పతకాలు | కాంస్య పతకాలు | మొత్తం |
---|---|---|---|---|---|
1 | అమెరికా | 37 | 24 | 31 | 92 |
2 | రష్యా | 32 | 28 | 28 | 88 |
3 | చైనా | 28 | 16 | 15 | 59 |
4 | ఆస్ట్రేలియా | 16 | 25 | 17 | 58 |
5 | జర్మనీ | 13 | 17 | 26 | 56 |
6 | ఫ్రాన్స్ | 13 | 14 | 11 | 38 |
7 | ఇటలీ | 13 | 8 | 13 | 24 |
8 | నెదర్లాండ్స్ | 12 | 9 | 4 | 25 |
9 | క్యూబా | 11 | 11 | 7 | 29 |
10 | బ్రిటన్ | 11 | 10 | 7 | 28 |
2000 ఒలింపిక్ క్రీడలలో భాగంగా జరిగిన క్రీడలు
|
2000 ఒలింపిక్ క్రీడలలో భారత్ ఒకే ఒక్క కాంస్య పతకాన్ని సాధించి పతకాల పట్టికలో 70వ స్థానాన్ని పొందినది. మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లేశ్వరి భారతదేశానికి ఏకైక స్వర్ణాన్ని సాధించిపెట్టింది. అథ్లెటిక్స్లో చాలా భారత క్రీడాకారులు తొలి రౌండ్లోనే నిష్క్రమించగా రాజీవ్ బాల కృష్ణన్, బీనామోల్లు సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగాలు. పురుషుల లైట్ వెయిట్ లిఫ్టింగ్ (81 కేజీల విభాగం)లో గురుబచన్ సింగ్ క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయాడు. హాకీలో 7వ స్థానాన్ని మాత్రమే పొందగలిగింది.