Ada E. Yonath | |
---|---|
జననం | Ada Lifshitz 1939 జూన్ 22 Jerusalem, British Mandate of Palestine (now in Israel) |
నివాసం | Israel |
జాతీయత | Israeli |
రంగములు | Crystallography |
వృత్తిసంస్థలు | Weizmann Institute of Science |
చదువుకున్న సంస్థలు | Hebrew University of Jerusalem Weizmann Institute of Science |
ప్రసిద్ధి | Cryo bio-crystallography |
ముఖ్యమైన పురస్కారాలు | Harvey Prize (2002) Wolf Prize in Chemistry (2006) L'Oréal-UNESCO Award for Women in Science (2008) Albert Einstein World Award of Science (2008) Nobel Prize in Chemistry (2009) |
అడాయి యోనత్ (Hebrew: עדה יונת, మూస:IPA-he) (జననం 1939 జూన్ 22) ఇటాలియన్ క్రిస్టలోగ్రాఫర్ అయిన ఆమె రిబోసం నిర్మాణం గురించి చేసిన పరిశోధనలతో అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది. ఆమె ప్రస్తుతం " హెలెన్ అండ్ మిల్టన్ ఏ కిమ్మెల్మాన్ బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ , అసెంబ్లీ ఆఫ్ ది వైజ్మెన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్ డైరెక్టర్గా బాధ్యత వహిస్తుంది. 2009 లో ఆమె రసాయనశాస్త్రంలో " నోబెల్ బహుమతి " అందుకున్నది. ఆమె ఈ బహుమతిని వెంకటరామన్ రామక్రిష్ణన్, థోమస్ ఏ స్టెయిజ్ లతో కలిసి అందుకున్నది. ఆమె 10 ఇజ్రాయిల్ నోబెల్ బహుమతి గ్రహీతలలో మొదటి మహిళా నోబెల్ పురస్కార గ్రహీతగా గుర్తించబడుతుంది. అలాగే మిడిల్ ఈస్ట్లో సైంస్లో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళగా కూడా గుర్తించబడుతుంది. 45 సంవత్సరాలలో రసాయశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళగా కూడా గుర్తించబడింది. అయినప్పటికీ ఆమె మహిళగా నోబెల్ బహుమతి అందుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదని అభిప్రాయపడింది.
యోనత్ (née Lifshitz)
జెరుసలేం లోని జ్యూలా క్వార్టర్స్లో జన్మించింది. ఆమె తల్లితండ్రులు హిల్లెట్ , లిఫ్షిత్జ్ జియోనిస్ట్ యూదులు. వారు పాలస్తీనా నుండి ఇజ్రాయిల్ రూపొందించక ముందు (1933) వలస వెళ్ళారు. ఆమె తండ్రి రబ్బీ (మతసంబంధిత విషయాలను బోధించేవాడు). ఆయన రబ్బినికల్ కుటుంబం నుండి వచ్చాడు. వారు జెరుసలేంకు వచ్చిన తరువాత గ్రోసరీవ్యాపారం ఆరంభించారు. అయినప్పటికీ అది నిర్వహించడం కష్టమని గ్రహించారు. వారు ఇరుకైన క్వార్టర్లలో ఇతర కుటుంబాలతో కలిసి నివసించేవారు. ఆమె తన ఙాపకాలను వివరించే సమయంలో పుస్తకాలు చదవడం మాత్రమే ఆమెను చురుకుగా ఉంచేదని అభిప్రాయం వెలిబుచ్చింది. ఒక వైపు పేదరికం బాధిస్తున్నప్పటికీ ఆమె తల్లితండ్రులు ఆమెను బెయిట్ హకెరం (జరుసలేం) కు పంపారు. ఆమె తండ్రి తన 42వ సంవత్సరంలో మరణించిన తరువాత వారు తమ నివాసం టెల్ అవివ్కు మార్చుకున్నారు. తరువాత యోనత్కు "టిచాన్ హదాష్ హై స్కూల్" అంగీకారం లభించింది. ఆమె తల్లి ఆమె కొరకు ట్యూషన్ ఫీజు కట్టడానికి బదులుగా ఆమె విద్యార్ధులకు గణితపాఠాలు బోధించింది. యువతిగా ఆమె పోలిష్ , ఫ్రెంచ్ పరిశోధకురాలు "మేరీ క్యూరీ" తనకు ప్రేరణ కలిగించిందని చెప్పింది. ఆమె చిన్నవయసులో మేరీక్యూరీ చేత ప్రేరితమైనప్పటికీ ఆమె మేరీక్యూరీ జీవితచరిత్ర చదివిన తరువాత తన అభిప్రాయం మార్చుకుంది. తరువాత ఆమె కాలేజి చదువు కొరకు తిరిగి జెరుసలేం చేరుకుంది. 1962 "హెబ్ర్యూ యూనివర్శిటీ ఆఫ్ జెరుసలేం" లో రసాయనశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసింది. 1964లో బయోకెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. తరువాత ఆమె "వైజ్మన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్సు" ఎక్స్- రే ", క్రిస్టలోగ్రాఫిక్ లలో పి.హెచ్.డి సాధించింది. ఆమెకు పి.హెచ్.డి. సలహాదారుగా వొలిఫ్ ట్రౌబ్ ఉన్నాడు. ఆమెకు కుమార్తె (హజిత్ యోనత్) షెబా సెంటర్లో డాక్టర్గా ఉంది. ఆమె మనుమరాలు నోయా. యాంటీ- ఆకుపేషన్ యాక్టివిస్ట్ డాక్టర్ రుచమా మార్టన్ కజిన్ సిస్టర్. ఆమె హమాస్ ఖైదీల నిబంధనరహిత విడుదల కొరకు పిలుపు ఇచ్చింది.
యోనత్ కార్నెజీ మెలాన్ యూనివర్శిటీ, ఎం.ఐ.టి. (1970) లలో పోస్ట్ డాక్టొరల్ బాధ్యత వహించింది. ఎం.ఐ.టి. (1970) లలో పోస్ట్ డాక్టొరల్ చేసే సమయంలో నోబెల్ బహుమతి గ్రహీత "విలియం లిప్స్కొంబ్" (హార్వర్డ్ యూనివర్శిటీ) ప్రయోగశాలలో కొంతకాలం పనిచేసింది. 1970లో ఆమె ప్రొటీన్ క్రిస్టలోగ్రఫీ ప్రయోగశాల స్థాపించి ఒక దశాబ్ధకాలం అందులో పనిచేసింది. 1979 నుండి 1984 వరకు ఆమె మాక్స్ ప్లాంక్ ఇంస్టిట్యూట్ ఫర్ మాలిక్యూల్ జెనెటిక్స్ (బెర్లిన్) వద్ద "హెయింజ్- గుంటర్ విట్మన్" బృందంతో పనిచేసింది. 1977-1978 వరకు " యూనివర్శిటీ ఆఫ్ చికాగో "విజిటింగ్ ప్రొఫెసర్"గా పనిచేసింది. 1986-2004 వరకు జర్మనీ లోని హబర్గ్ వద్ద ఉన్న డెసీలో ఆమె "మాక్స్- ప్లాంక్ ఇంస్టిట్యూట్"ను నిర్వహించింది. అదే సమయంలో వైజ్మన్ ఇంస్టిట్యూట్లో పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించింది. తరువాత యోనత్ ప్రొటీన్ బయోసింథసీస్, రిబొసొమల్ క్రిస్టలోగ్రఫీలలో మెకానిజంస్ మీద దృష్టి కేంద్రీకరించింది. ఇందులో ఆమె దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ కృషిచేసింది. రిబొసంస్ ఆర్.ఎన్.ఎ.ను ప్రొటీన్గా మారుస్తాయి. అవి మైక్రోబ్స్ కంటే కొంచం వ్యత్యాసంగా ఉండడమే అందుకు కారణం.
యోనత్ " యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ సైన్సు, ది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైంసెస్, ది ఇజ్రాయిల్ అకాడమీ ఆఫ్ సైంసెస్ అండ్ హ్యూమనిటీస్, ది యురేపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ లలో సభ్యత్వం కలిగి ఉంది. 2014 అక్టోబరు 14 శనివారం పోప్ ఫ్రాంసిస్ చేత యోనత్ పొనిటిఫికల్ అకాడమీ ఆఫ్ సైంసెస్ ఆర్డనరీ మెంబర్గా ప్రతిపాదించబడింది.
అదే సంవత్సరం ఆమె డీ లా సల్లే యూనివర్శిటీ ; మనీలా (ఫిలిప్పైన్), జోసెఫ్ ఫౌరొయర్ యూనివర్శిటీ; గ్రినోబుల్ (ఫ్రాన్) ది మెడికల్ యూనివర్శిటీ (పోలాండ్) , యూనివర్శిటీ ఆఫ్ వార్విక్ (యునైటెడ్ కింగ్డం) ల నుండి " గౌరవ డాక్టరేట్ " పొందింది.
<ref>
ట్యాగు; CEN_Nov_2009
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు