గృహ హింస |
---|
కుటుంబ చట్టం |
---|
Marriage and other equivalent or similar unions and status |
కాలపరిమితి వివాహములు |
Dissolution of marriages |
Other issues |
Private international law |
The Family and the Criminal Code (or Criminal Law) |
పురుషులపై హింస |
---|
హింస |
హత్య |
అవయవ తొలగింపు |
లైంగిక హక్కులు హరించివేయటం |
అత్యాచారం |
అక్రమ తరలింపు |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం గృహహింస నుండి మహిళలకు (43/2005 చట్టం) రక్షణ చట్టానికి 2005లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం మాత్రం 2007సం.లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది . జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్లా పీడీని రక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. కేసుల నమోదు, బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ఒక కౌన్సెలర్తో పాటు న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసు హోంగార్డులను నియమించారు. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు అభిప్రాయాలతో సమాజం లోనే కాకుండా ఇంట్లో కూడా స్ర్తీ, పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం కొందరు మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికి వారు సరైన న్యాయ సలహాలు తెలియక పోవటంతో ఇటువంటివి మరిన్ని పెరిగిపోతున్నాయి. ఈ చట్ట ప్రకారం భార్యలు హింసకు గురైన స్త్రీలు న్యాయం కోసం జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, సిడిపిఓలు, పోలీసు, రెవెన్యూ అధికారిని లేదా న్యాయ సేవా అధికారిని, సేవలందించే సంస్థలు, ఆశ్రయం అందించే సంస్థలు లేదా పోలీస్ను సంప్రదించాలి. చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం అందించే సంస్థలు వైద్య సహాయం గురించి సమాచారం బాధితురాలి రక్షణ, రక్షణ అధికారి బాధ్యతలు చేపట్టాలి. మెజిస్ట్రేట్కు దరఖాస్తు అందిన మూడు రోజుల్లో మొదటి వాదన వింటారు.60 రోజుల్లో తుది తీర్పు ఇస్తారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత బాధ్యులపై కేసు నమోదు చేయడం, తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు 60 రోజుల్లో కేసును పరిష్కరించాల్సి ఉంది.
No data <0.10 0.10–0.5 0.5–1 | 1–5 5–15 15–50 |
పరువు, ప్రతిష్ఠ కోసం, భవిష్యత్తులో అండదండ ఉండదనే ఉద్దేశంతో బయటకు రాలేక ఇళ్లలోనే అతివలెంతోమంది మగ్గిపోతున్నారు. కేసులు త్వరగా పరిష్కారం కాక, మరోవైపు వేధింపులకు పాల్పడిన వారి వైపు నుంచి ఇతరత్రా సమస్యలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత ఆరోపణలకు గురైన వారికి సమన్లు జారీ చేయడం, వారి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసేందుకు వారు స్థానికంగా ఉండకపోవటం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత కూడా విచారణకు వచ్చేసరికి వారంలో ఒక రోజు మాత్రమే గృహ హింస కేసులు విచారిస్తున్నందువల్ల జాప్యం జరుగుతోంది.
కౌన్సెలింగ్ నిర్వహించాక కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకొంటున్నారు. కొంత మంది వారంతట వారే ఫిర్యాదులు వెనక్కి తీసుకొంటున్నారు. కొంతమంది బాధిత మహిళలకు మధ్యంతర భృతి చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.చిట్టచివరకు గాని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలులేదు. కనీసం పోలీసు కేసు నమోదు చేసేందుకు కూడా సవాలక్ష ఆటంకాలు ఉన్నాయి.ఈలోగా ఫిర్యాదు చేసేవారికి ఆశ్రయం కరవవుతూ నానా అవస్థలకు గురికావాల్సి వస్తోంది. చివరకు ఈ చట్టాన్ని ఆశ్రయించటమే తప్పైపోయిందన్నంత పరిస్థితి, ఆలోచన కలిగిస్తోంది..బాధితులకు న్యాయం జరగటం, నిందితులకు శిక్షలు పడటం ఏదీ పూర్తిస్థాయిలో జరగటంలేదు.ఫిర్యాదులకు దిగిన మహిళలు తమంతట తామే ఏదోలా సర్దుకు పోయేస్థితి ఏర్పడుతుంది. మహిళలు పడే మానసిక వేదన, క్షోభ బయటకు కానరాకుండా మరుగున పడుతున్నాయి. పిల్లలు, కుటుంబం పేరిట మహిళల్లో ఉండే సహజ బలహీనతలను ఆసరాగా చేసుకుని కేసులు రాజీదిశగా మారిపోతున్నాయి.ఒకసారి రాజీ అని వచ్చాక మహిళల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. తిరిగి అధికారులను ఆశ్రయించలేక మౌనంగా ఉండిపోతున్నారు. కుటుంబ వ్యవహారాలన్నాక ఇటువంటి ఘటనలు సాధారణమేనని సర్దుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భార్యను హింసించే భర్త, కుటుంబంలోని మహిళలను కూడా గృహహింస నిరోధక చట్టం కింద విచారించవచ్చు. భర్త అతని కుటుంబసభ్యులు భార్యను హింసిస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో మహిళలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి.. వారిని కూడా నిందితులుగా చేర్చి విచారించాల్సిందే.వేధింపులు జరిపింది మహిళలంటూ భర్త, మామ తదితర పురుష కుటుంబసభ్యులు తప్పించుకుంటున్నారు.