నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
లంచం (ఆంగ్లం: Bribery) ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం డబ్బుల రూపంలో గానీ లేదా బహుమతుల రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, ఆస్తి రూపంలో, ఓటు, లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని 'లంచగొండి' అంటారు.
ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.అవినీతి ఆచూకీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఎవరైనా ఉచితంగా (టోల్ఫ్రీ నెంబరు) 155361 కు సమాచారం అందించవచ్చు.
"మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే,సగం మంది మధ్యస్థంగా ఉంటారు.ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోవడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడపవలసి వచ్చింది.నేను చిన్న వయసులో ఉన్నప్పుడు- అవినీతి పరుడిని హీనంగా చూసేవారు.నాడు అవినీతి పరుల పట్ల సమాజానికి తృణీకార భావన ఉండేది. అదిప్పుడు లేదు. సమాజం వారిని ఆమోదిస్తున్నది, డబ్బు ఉంటే గౌరవంగా చూస్తున్నారు, ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు.మన దేశంలో ఇంకా నూటికి 20 మంది నిజాయితీ పరులున్నారు.వీరు ఏ ప్రలోభాలకూ లొంగని వారు. వారికి అంతరాత్మ అంటూ ఉంది "--- ప్రత్యూష్ సిన్హా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్
అవినీతి నిర్మూలనకు ప్రత్యేక శాఖలున్నాయి. ప్రతిఒక్కరి సహకారం దీనికి అవసరం. దీని కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలి.